పిడుగురాళ్ళ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సెమీక్రిస్మస్ వేడుకలు

గురజాల: పిడుగురాళ్ళ జనసేన పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రేమ, శాంతి, కరుణ కు క్రీస్తు మారుపేరని ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని పాస్టర్ మరియదాస్ ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కటిచేసి వేడుకలను ప్రారంభించ్చారు. ఈ సందర్భంగా పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ మాట్లాడుతూ క్రీస్తు మార్గం అనుసరిస్తే అశాంతికి తావు ఉండదని అదే నినాదం పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారని అన్నారు. విలాసవంతమైన జీవితాన్ని వదిలి ప్రజలు కోసం పోరాడుతూ తనకష్టార్జితాన్ని మరణించిన కౌలు రైతులకు ఇస్తున్నారని రమేష్ అన్నారు. జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల ఖాసిం సైదా మాట్లాడుతూ సమాజంలో అందరూ సమానమేనని సమాజంలో హింసకు తావులేకుండా అహింస మార్గంలో ముందుకు వెళ్తేనే ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతారని అన్నారు. సమాజంలో అన్ని మతాల ఒకటేనని అందరూ అన్ని పండగలు చేసుకుంటేనే ఐకమత్యం స్నేహ భావం ఉంటుందని తెలియజేశారు. మండల ఉపాధ్యక్షులు పెడకోలిమి కిరణ్ మట్లడుతూ కులాల మతాలు అడ్డుగోడలు తొలగేందుకే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నిర్మించారని అదే సిద్ధాంతం తో ఆయన బాటలో ముందుకు వెళ్తామని కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాక్షుడు బయ్యవరవు రమేష్, ప్రోగ్రాం కమిటీ మెంబర్ దూదేకుల సలీమ్ మహిళ నాయకురాలు వెంకటరమణ ప్రధాన కార్యదర్శి గుఱ్ఱం కోటి,కొమ్మిరిశెట్టి సతీష్, సంయుక్త కార్యదర్శి క్రోసూరి శ్రీకాంత్, బేతంచర్ల ప్రసాద్, బేతంచర్ల నాగేశ్వరరావు, సంగుల రామంజి, అశోక్, ఆదిత్య, ఉదయ్, నవీన్ మొదలగు కార్యకర్తలు పాల్గొన్నారు.