రిమాండ్ లో ఉన్న శ్రీకాళహస్తి జనసైనికులు, చిందేపల్లి గ్రామస్థులకు బెయిల్ మంజూరు

శ్రీకాళహస్తి నియోజకవర్గం, చిందేపల్లి గ్రామం రోడ్డు సమస్య కోసం పోరాటం చేసిన నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా పైన, జనసైనికులు, గ్రామస్థులపైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇందులో 6 మందిని 29 మార్చ్ నాడు రిమాండ్ పంపడం జరిగింది. రిమాండ్ లో ఉన్న 6 గురికీ తిరుపతి జిల్లా కోర్ట్ నందు బైలు మంజూరు అయ్యింది. ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారికి హైకోర్ట్ నందు ఈ కేసులో ఊరట లభించింది. మరో 13 మంది (వినుత కోటా భర్త కోటా చంద్రబాబు, తల్లిదండ్రులు, జనసైనికులు, గ్రామస్థులకి) కి అక్రమ కేసు నుండి ఉపశమనం కొరకు న్యాయపోరాటం కొనసాగుతుంది. రిమాండ్ నుండి విడుదల అయిన జనసైనికులకు నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా, జనసైనికులు మంగళ హారతులతో, పూలమాల వేసి బయటకి తీసుకుని రావడం జరిగింది. జనసేన పార్టీ తరఫున, గ్రామ ప్రజల తరఫున పోరాడి ఇబ్బందులు పడ్డ వారిని శాలువాతో సన్మానించడం జరిగింది. రిమాండ్ లో ఉన్న వారి బైలు కోసం నిరంతరాయంగా కృషి చేసిన లాయర్ శ్రీమతి కంచి శ్యామలను గౌరవిస్తూ, సత్కరించడం జరిగింది.