మౌలానా అబుల్ కలామ్ ఘన నివాళులు

సత్తెనపల్లి: మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతిని పురస్కరించుకొని నూర్ బాషా సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దూదేకుల సలీం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నూర్ బాషా సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి దూదేకుల ఖాసీం సైదా మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ స్వాతంత్రసమరయోధుడుగా తొలి విద్యాశాఖ మంత్రిగా విస్తృతమైన సేవలు అందించారని. ఆయన స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండల అధ్యక్షులు దూదేకుల కాశీం సైదులు(బుజ్జి), నకరికల్లు మండల అధ్యక్షులు దూదేకుల నభి, దూదేకుల బాషా, ముస్లిం యూత్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సయ్యద్ ఆరిఫ్, దూదేకుల ఖాసీం దూదేకుల సిలార్, దూదేకుల సైదా, హరుణ్, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.