నూజివీడు జనసేన అధ్వర్యంలో గాంధీ మహాత్మునికి ఘన నివాళులు

నూజివీడు: మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని నూజివీడు జనసేన పార్టీ అధ్వర్యంలో ముసునూరు మండలంలోని రమణక్కపేటలోని మహాత్మా గాంధీ విగ్రహానికి నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు పూల దండ వేసి నివాళులు అర్పించి చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం పాశం నాగబాబు మాట్లాడుతూ అహింసా పరమో ధర్మః అంటూ, బ్రిటీష్ వారిని తరిమికొట్టిన స్వాతంత్ర్య సమరయోధుడు భారత జాతిపిత మహాత్మాగాంధీ అని రేపు జనసేన- టీడీపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ పథకాలకు జాతి నాయకుల పేర్లు పెట్టి స్మరించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు, మండల నాయకులు ఉప్పే నరేంద్ర, వేట త్రినాధ్, చేకూరి అనిల్, సతీష్, పవన్, నల్లగోపు వెంకటేశ్వరరావు, శివ జనసైనికులు, చిన్నారులు పాల్గొన్నారు.