ఇంటింటా జనసేనకు పెరుగుతున్న ఆదరణ: పోలిశెట్టి శ్రీనివాసులు

రాజంపేట, జనసేన పవనన్న ప్రజాబాట కార్యక్రమానికి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది. రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు నందలూరు మండలంలోని పలపుత్తూరు పంచాయతీలోని భగిడిపల్లి, ఏకిరిపల్లి, నూతిపల్లి, చింతలకోన గ్రామాలలో 85వ రోజు పవనన్న ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలిశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్న సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి ఆదరణ రావడం తమను ఎంతో ఉత్సాహ పరుస్తుందన్నారు. ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేకం వ్యక్తమవుతుందని, చిత్తశుద్ధి నిబంధత కలిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి, భాస్కర్ పంతులు, వీరాచారి, గోపి, జనసేన వీరమహిళలు జడ్డా శీరీష తదితరులు పాల్గొన్నారు.