పంతం నానాజీకి మద్ధతు తెలిపిన వివిధ సంఘాల నేతలు

కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామానికి చెందిన శెట్టిబలిజ, యాదవ, రజక, గౌడ, మత్స్యకార సంఘ పెద్దలు వాసంశెట్టి సత్తిబాబు, ఈగల ప్రభాకర్, కేశబోయిన ఏడుకొండలు, మొరుకుర్తి అప్పలకొండ, బుర్రే ఆనందరావు, పంతాడ ఆదినారాయణ, పంతాడ సత్తిబాబు, పాలేపు కృష్ణ, పాలేపు లోవరాజు, పడమటి వీరబాబు మరియు స్థానిక టీడీపీ నాయకులు తాతపూడి రామక్రిష్ణ, ఎండీ. జిలాని తదితరులు జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీని కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి దుస్సాలువ కప్పి ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారికి నానాజీ అభినందనలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.