వారాహి యాత్ర విజయవంతం కావాలని గల్ఫ్ జనసేన ప్రత్యేక పూజలు

యూఏఈ: జనహితం కోరే జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్న “వారాహి యాత్ర” గల్ఫ్ జనసేన యూఏఈ ద్వారా వారాహి అమ్మవారి ఆశీర్వాదములతో విజయవంతం కావాలని, అజమాన్ మైత్రి ఫామ్స్ నందు గల పార్టీ ఆఫిసు కార్యాలయంలో ఆదివారం జనసైనికులు మరియు వీరమహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ జనసేన యూఏఈ నాయకులు, నాగ వీర ప్రసాద్ మావూరి, ఉదయ్ కిరణ్ కోసూరి, చంద్రశేఖర్ మొగళ్ల, రవి కుమార్, ఎస్ రవివర్మ కడిమండ్ల, కె.డి.వి.ఎస్ నారాయణ, యుగేందర్ ఉప్పాడ కృష్ణ కిషోర్ వీరమల్లు, మనీశ్వరరావు బొబ్బిలి, విజయ కుమార్ నామ, గల్ఫ్ జనసేన వీరమహిళలు సునీత కొమరవోలు, మంజుల దేవి మొగళ్ల లక్ష్మి రజిత, కడిమండ్ల లక్ష్మీదేవి, లక్ష్మి గెడ్డం తదితరులు పాల్గొన్నారు.