పడాల అరుణకు శుభాకాంక్షలు తెలిపిన గురాన అయ్యలు

విజయనగరం, జిల్లాలో వైకాపా నాయకుల అరాచక, అక్రమాలను చెత్త ఊడ్చినట్లు ఊడ్చి, వారిని ఎండగడుతామని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. జనసేన పిఎసి సభ్యురాలిగా నియమితులైన పడాల అరుణను బుధవారం జనసేన నేత గురాన అయ్యలు ఆధ్వర్యంలో జనసైనికులు, వీర మహిళలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మీడియాతో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పని చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన-టిడిపి కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వం కొనసాగిస్తున్న ధమనకాండ నుంచి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. జగన్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలు ఎన్నికల్లో వైసీపీకు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు ఆదాడ మోహన్ రావు, డి.రామచంద్రరాజు, మాతా గాయిత్రి, పితాల లక్ష్మీ, దుప్పాడ జ్యోతి, రవితేజ, రవీంద్ర, పిడుగు సతీష్, చక్రవర్తి, అడబాల వేంకటేష్, దుప్పాడ నరేష్, ఎమ్.పవన్ కుమార్, వజ్రపు నవీన్ కుమార్, పృథ్వీ భార్గవ్, కంది సురేష్ కుమార్, వెంకట రమణ, మధు తదితరులు పాల్గొన్నారు.