కొత్తపేటలో ప్రమాద భీమా చెక్కులను అందజేసిన నాదెండ్ల

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, కొత్తపేట మండలంలో ఇటీవలే ప్రమాదవశాత్తు మరణించిన జనసేన పార్టీ కార్యకర్తలు ఖండ్రిగ, అల్లపల్లి వారి పాలెంకు చెందిన బండారు వెంకటరాజు, వానపల్లికి చెందిన నాగిరెడ్డి సత్తిబాబు కుటుంబాలను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అద్యఖులు కందుల దుర్గేష్, నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ కలిసి పరామర్శించి, పవన్ కళ్యాణ్ తరుపున 5 లక్షలు రూపాయల ప్రమాద భీమా చెక్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.