శ్రీరంగపట్నంలో పలు కుటుంబాలను పరామర్శించిన గురుదత్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు మేడ గురుదత్ ప్రసాద్ పర్యటనలో పలువురిని పరామర్శించడం జరిగింది.

  • గత కొన్ని రోజులు క్రితం లారీ ప్రమాదంలో చనిపోయిన శరకణం శివ కుటుంబాన్ని గురుదత్ పరామర్శించి వారి భార్య రోజాకి మనోధైర్యం కల్పించి జనసేన పార్టీ తరఫున రూపాయలు 5,000/- ఆర్ధిక సాయం అందించడం జరిగింది.
  • అడపా పెద్ద పెద్ద వెంకటేశ్వర్లు భార్య లక్ష్మి గత కొన్ని రోజుల క్రితం కాలం చేశారని వార్త స్థానిక జనసేనశ్రేణుల ద్వారా తెలుసుకున్న గురుదత్ వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.
  • దండేటి బసియ్య తల్లి మరణించారనే వార్త తెలుసుకున్న గురుదత్ వారి కుటుంబాన్ని పరామర్శించి జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు.
  • శ్రీరంగపట్నం గ్రామ పర్యటనలో భాగంగా ఎక్స్ ఎమ్మెల్యే బదిరెడ్డి అప్పన్న దొర గారి అబ్బాయి ఎక్స్ ఎంపిపి బదిరెడ్డి రాజా, బదిరెడ్డి బుజ్జిలను మేడ గురుదత్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఐటి కోఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, నాగవరుపు భాను శంకర్, అత్తిలి శ్రీరామ చంద్రమూర్తి, తన్నీరు తాతాజీ, జనసేన పార్టీ గ్రామ వైస్ ప్రెసిడెంట్ అడపా అంజి, మండల కార్యదర్శి కోలా జాన్ ప్రసాద్, మండల కార్యదర్శి జాజుల వెంకట రామకృష్ణ, సింగరపు పోతురాజు, కనుమూరి చంద్రయ్య, అడపా చిన్న వెంకటేశ్వలు, ముత్యాల రత్నజీ, కమ్మిలి శ్రీను, అతికింశెట్టి శ్రీను, బత్తుల హరి, జాజుల భీముడు అడపా శ్రీను పాల్గొన్నారు.