పలు కుటుంబాలకు పితాని బాలకృష్ణ ఆత్మీయ పరామర్శ

ముమ్మిడివరం: జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం ఎర్రకాయ చెరువు గ్రామానికి చెందిన ఇటీవల మృతిచెందిన వాసంశెట్టి తాతాజీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ముమ్మిడివరం మండలం, సోమిదేవరపాలెం గ్రామానికి చెందిన ఇటీవల మృతిచెందిన అడబాల లోవ గంగాభవాని చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి భర్త రామకృష్ణను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఐ పోలవరం మండలం గుత్తెనదీవి గ్రామానికి చెందిన ఇటీవల మృతిచెందిన లంకెలపెల్లి సత్యనారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించి, కుమారులు లంకెలపల్లి బుజ్జిగారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన ఇటీవల మృతిచెందిన లంకెలపల్లి అమ్మాజీ చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఐ పోలవరం మండలం, జి వేమవరం గ్రామానికి చెందిన ఇటీవల మృతిచెందిన నల్లా సీతమ్మ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముమ్మిడివరం మండలం కర్రివాని రేవు గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన నక్క చిన్న సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాట్రేనికోన మండలం, చెయ్యరు గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన గొలకోటి పేరయ్య నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాట్రేనికోన మండలం చెయ్యరు జల్లగుంట గ్రామానికి చెందిన ఇటీవల యాక్సిడెంట్లో గాయపడి మృతిచెందిన గవర శ్రీరాములు (రాంబాబు) చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమాలలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), సానబోయిన మల్లికార్జున రావు, గొలకోటి వెంకటేశ్వరరావు, మద్దింశెట్టి పురుషోత్తం, సానబోయిన వీరభద్రరావు, దూడల స్వామి, పెన్నాడ శివ, బొంతు నరేష్ నర్మదా, వంగా విజయ సీతారాం, గాలిదేవర బుల్లి, కాయల బలరాం, అడపా సాయి, చితలపూడి పల్లంరాజు, త్సవటపల్లి వెంకటేశ్వరరావు, వనుముశెట్టి రామయ్య, విత్తనాల లోవరాజు, సలాది ప్రసాద్, పడాల లక్ష్మణ్, ఇండుగుల రామకృష్ణ, కర్రి శేఖర్, గంగాబత్తుల చక్రం, రాయపురెడ్డి జానకి రామయ్య మొదలగువారు పాల్గొన్నారు.