పలు కుటుంబాలను పరామర్శించిన గురుదత్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామనికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఆడివరపు కన్నారావు గత కొన్ని రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్లో గయాపడ్డారు అనే వార్త స్థానిక జనసేనశ్రేణుల ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వారిని కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. కోరుకొండ గ్రామానికి చెందిన జనసైనికుడు కర్రి సత్యనారాయణ ఆహ్వానం మేరకు గురుదత్ వారి దగ్గరకు వెళ్లడం జరిగింది. సత్యనారాయణ పూలమాలతో గురుదత్ ని సత్కరించారు. పశ్చిమ గానుగూడెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియశీలక సభ్యుడు బద్దిరెడ్డి శ్రీనివాస్ గత కొన్ని రోజుల బైక్ ఆక్సిడెంట్ లో గాయపడ్డరు వార్త తెలుసుకున్న గురుదత్ శ్రీనివాస్ ని వారి ఇంటి వద్ద జనసేన పార్టీ నాయకులతో కలవడం జరిగింది. నర్సాపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ యువ నాయకులు పండు నాన్న అమ్మ గత కొన్ని రోజుల క్రితం కాలం చేసారు అనే వార్త మండల నాయకత్వం ద్వారా తెలుసుకున్న గురుదత్ వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండల జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, కోరుకొండ మండల కమిటీ మెంబర్ బివివి సత్యనారాయణ కోరుకొండ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పోసిబాబు, కోరుకొండ మండల సీనియర్ నాయకుడు తెలగంశెట్టి శివ, చదువు ముక్తేశ్వరరావు, కొచ్చర్ల బాబి, రాచపోతుల సురేష్, దేవన కృష్ణ, మండపాక మురళి, చోంగ సీతారామ్, చల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.