చేనేత కార్మికులను ఆదుకోవాలి : రాటాల రామయ్య

సిద్ధవటం: చేనేత కార్మికులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. మంగళవారం సిద్ధవటం మండలం, ఉప్పరపల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా కురుస్తున్న మిచౌంగ్ తుఫాను వర్షాల కారణంగా మాధవరం-1, కొత్త మాధవరం, కొండమాచపల్లి తదితర గ్రామాల చేనేత కార్మికులు పనులులేక ఉపాధి కోల్పోయారన్నారు. యిప్పటికే నూలు, పట్టు, జరిపెరగడంతో గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో మళ్లీ తుఫాన్ కారణంగా చేనేత కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికులను ఆదుకోవాలని ఆయన కోరారు.