జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు

శేర్లింగంపల్లి నియోజకవర్గం: వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ మాధవ రెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మని ఇస్తారు. వైద్యం అంటే వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవలు అందిస్తున్న వైద్యులను దేవుడిగా భావించే సంస్కృతి మనది. వైద్యో నారాయణో హరి అనే మాటను పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఆరోగ్యపరమైన సమస్యలతో వచ్చిన వారికి స్వస్థత కలిగించి రోగులు వారి కుటుంబీకుల ముఖాన చిరునవ్వులు చూసి సంతోషించే వైద్యులు ఎందరో ఉన్నారు మరియు కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎంతో తేగింపుతో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్యసేవలు అందించిన వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గం తరపున శుభాకాంక్షలు. ఆస్పత్రుల మరియు వైద్యుల పైన దాడులు ఆస్కారం లేకుండా కఠినమైన జీవోలు తీసుకురావాలి, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది. మన శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని చాలా పిహెచ్ఎస్ లో వైద్య పరికరాలు లేక మరియు పరిశుభ్రత లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా శేర్లింగంపల్లిలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ శేర్లింగంపల్లి ఇంచార్జి గా డిమాండ్ చేస్తున్నాం.. కార్యక్రమంలో పాల్గొన్నవారు జనసేన నాయకులు మరియు కార్యకర్తలు కళ్యాణ్ చక్రవర్తి, నాయక్, దుర్గ ప్రసాద్, హరి, రాజేష్ నాయక్, శ్రవణ్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.