కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి నూజివీడు జనసేన రూ.10 వేల సాయం

నూజివీడు నియోజకవర్గం, గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నూజివీడు పట్టణానికి చెందిన జనసైనికుడు నీలపు ప్రసాద్ ను జనసేన నాయకులు పాశం నాగబాబు, జంధ్యావుల అనిల్ పరామర్శించారు. జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి రెడ్డి మణి సూచన మేరకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు అందచేశారు. అవసరాల మేరకు ఇంకా ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రసాద్ కు రెండు కిడ్నీలు మార్చాల్సి ఉన్నందున ఇతోధికంగా సాయం చేయాలని వారు జనసైనికులను కోరారు.