‘రా కదిలి రా’ పోస్టర్ ఆవిష్కరణ

  • గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లి నియోజకవర్గ ప్రజలకి, దేశ ప్రజానీకానికి జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మహోన్నతమైన వ్యక్తి ఆయన కూడా పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం, అలాగే హరికథ కళాకారిణి ఉమామహేశ్వరీ, మన ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచు ఆమెకి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు జనసేన పార్టీ తరుపున కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు. అలాగే శనివారం పీలేరులో జరిగే రా.. కదిలి రా.. కార్యక్రమం యొక్క పోస్టర్ ని విడుదల చేసారు. జనసేన పార్టీ, మిత్ర పక్షమైన తెలుగుదేశం పార్టీ శ్రేణుల అందరిని కూడా కలుపుకొని మదనపల్లి నియోజకవర్గం నుండి దాదాపు 200 వాహనాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అందరూ కూడా కొలహాలంగా వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మదనపల్లి నుండి రాజంపేట పార్లమెంట్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని అవసరమైతే పాతలానికి తొక్కేయాలని జనసేన టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ పిలునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.