ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు: ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్‌

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరిపైనా ఆ శ్రీరాముడి కృప ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దేశ ప్రజలందరిపై ఆ శ్రీరామచంద్రుడి కృప ఉండాలి. మర్యాద పురుషోత్తముడైన ఆయన సందేశాన్ని అందరూ అనుసరించాలి. కరోనా సంక్షోభం నెలకొన్న ఈ సందర్భంలో అందరూ జాగ్రత్త చర్యలు పాటించండి’ అని మోదీ ట్వీట్‌లో వెల్లడించారు.

రాముడి జీవితం స్ఫూర్తిదాయకం: రాష్ట్రపతి

‘అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. పురుషోత్తముడైన రాముడి జీవితం అందరికీ స్ఫూర్తి దాయకం. ఈ సందర్భంగా మనందరం కొవిడ్‌-19 మహమ్మారిని ఓడిద్దామని ప్రతిజ్ఞ చేద్దాం’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.