సి. ఎం గారూ.. మైనార్టీలకు ఇచ్చిన హామీలను మరచినారా?: షేక్ సుభాని

జనసేన పార్టీ ఉపాధ్యక్షులు షేక్ సుభాని మాట్లాడుతూ జగన్ గారు గెలిచి దాదాపు నాలుగు సంవత్సరాలు కావొస్తున్న మైనార్టీ ముస్లింలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటే నెరవేర్చలేదనీ ఏద్దేవా చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వర్క్ బోర్డ్ కమిటీ కాదు మనకి కావాల్చినది ముస్లిం మైనార్టీ వర్క్ బోర్డ్ ఆస్తులు రీసర్వే చే ఎంచండి అన్నారు. ఓ మైనార్టీ వర్క్ బోర్డ్ ఏర్పాటు చేసిన మహనీయుడా ప్రతి మైనార్టీ ఆడ బిడ్డ పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తా అన్నారుగా అయ్యా అది ఎక్కడ..? అని ప్రశ్నించారు. ప్రమాదవశాత్తు మరణించిన ముస్లింలకు 5లక్షల రూపాయలు ఇస్తామన్నారుగా దాని గురించి పట్టించుకోరా.. మసీదులో నమాజు చదివించే ఇమాములకు ఇంటి స్థలాలు కేటాయించి, వారికీ ఇల్లు కటిస్తాం అన్నారు కదా అయ్యా దాని గురించి పూర్తిగా మర్చిపోయారా…? గత ప్రభుత్వంలో చిన్నచిత చేసుకుంటే వ్యాపారులకు సబ్సిడీ లోన్స్ మైనార్టీ కార్పొరేషన్ నుంచి వచ్చేవి.. ఇప్పుడు అవి కూడా లేకుండా చేశారు కదా..! ఈ సందర్బంగా వైసీపీ పార్టీ లో ఉన్న మైనార్టీ నాయకులను ఒక్కటే అడుగుతున్నా దయచేసి మైనార్టీలకు ఇచ్చిన హామీలు గురించి సి.ఎం గారికి గుర్తు చేయండి అని సుభాని అన్నారు.