సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు ప్రజలకి ఏవిధంగా న్యాయం చేస్తాడు

  • జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు బండి శేఖర్

గుంతకల్లు నియోజకవర్గం: సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు ప్రజలకి ఏవిధంగా న్యాయం చేస్తాడని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు బండి శేఖర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంతకల్ నియోజకవర్గం గుత్తిలో వైయస్సార్ ఆసరా చెక్కు పంపిణీ కార్యక్రమంలో గుంతకల్ శాసనసభ్యులు వై వెంకటరమణ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. స్టేజ్ ఎక్కి మైకు పట్టుకుంటే ఇలా ఇలా ఊగుతాడు ముఖానికి రంగు పూసుకుని డబ్బులు ఇస్తే డాన్స్ వేసేవాడు అని హేళన చేసి మాట్లాడుతున్నారు.
అదే రంగు పూసుకొని ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అదే వచ్చిన డబ్బుతో ఈ రాష్ట్రంలో కౌలు రైతుకు వేసిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటే ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగినది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు సమస్యలు ఉంటే అక్కడ మా అధ్యక్షులు గారు ఉండి ఆ సమస్యకి పరిష్కారం దిశగా ముందుకు వెళ్తున్నారు. ఈరోజు సొంతం చెల్లెలుకు న్యాయం చేయలేనోడు ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావస్తుంది మద్యపానం దశలవారీగా అంటూ దిక్కు దిక్కునా మద్యం షాపులు కనపడుతున్నాయి తిక్క తిక్క బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారు. ఇక ఒక తాపీ మేస్త్రి నుండి కార్పెంటర్ వరకు ఒక ఇసుక సమస్య నుండి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడేశారు
ఇంకా చెప్పుకుంటూ పోతే మీరు అధికారంలోకి వచ్చాక రాజధాని లేని రాష్ట్రం చేశారు ప్రత్యేక హోదా కేంద్రం మేడలు వంచి తెస్తా అన్నారు పోలవరం ప్రాజెక్టు. ఎంతోమంది యువతకు జనవరి జనవరి కి జాబ్ క్యాలెండర్ అని యువతను మోసం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు మీరు సిద్ధం సిద్ధం అని ఫ్లెక్సీలు పెట్టే ఖర్చు గవర్నమెంట్ హాస్పిటల్ లోనా ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్స్ మెరుగైన వైద్యం సంబంధించి ఇంక్రిమెంట్స్ పెట్టండి. ప్రజాధనాన్ని నీళ్లు పాలు చేస్తున్నారు. ఇంకొక్కసారి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనే ముందర ఆలోచించి మాట్లాడండి.