భారీగా పెంచిన కరెంట్ చార్జీలను తగ్గించాలి: రాటాల రామయ్య

రాజంపేట, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పెంచిన కరెంటు చార్జీల కారణంగా సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. మండలంలోని ఉప్పరపల్లెలో గురువారం ఆయన మాట్లాడుతూ, ట్రూ ఆఫ్ చార్జీలు సర్దుబాటు చార్జీల పేరిట సామాన్య మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాన్ని ప్రభుత్వం మోపుతుందన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ట్రూ ఆప్ సర్దుబాటు చార్జీల పేరిట ఏదో రకంగా అధిక చార్జీలు వేసి ఇబ్బందులను గురి చేసినట్టు తెలిపారు. తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.