వరద బాధితులను ఆదుకోవాలి: నేమూరి శంకర్ గౌడ్

హైదరాబాద్: భారీ వర్షాల దాటికి వరదల్లో చిక్కుకుపోయిన భూపాలపల్లి జిల్లా, మోరాంచపల్లి గ్రామం దాదాపు 200 కుటుంబాలు సహాయం కోసం ఎదురుచూస్తున్న సంఘటన చాలా బాధాకరం అని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ శంకర్ గౌడ్ ఈ విషయం తెలుసుకొని వెంటనే స్పందించి ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో మాట్లాడి ప్రజలు అక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఆరాతీసి తెలుసుకోవడం జరిగింది. ఈ బాధాకర సంఘటనపై స్పందిస్తూ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి వారిని ఆదుకోవాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ విషయం పట్ల స్పందిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు మేరుగు శివకోటి యాదవ్, బైరి వంశీలు భూపాల్ పల్లి జిల్లా జనసేన నాయకులు జెర్రీ పోతుల సనత్, కాల్వ రాజశేఖర్ లతో మాట్లాడి వరదల్లో చిక్కుకుపోయిన అక్కడ ప్రజల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకొని రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ కు వివరించడం జరిగింది.