ఘనంగా జనసేన మండల అధ్యక్షుల సన్మాన కార్యక్రమం

ఎచ్చెర్ల నియోజకవర్గం: జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు అధ్యక్షులును నియమించిన విషయం మీకు తెలిసిందే. నూతనంగా నియమించిన మండల అధ్యక్షులకు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ అధ్యక్షతన మరియు రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ వైస్ ప్రెసిడెంట్ విశ్వక్షేణ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా కాంతి శ్రీ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి మండల అధ్యక్షులు కృషి చేయాలని, దానికి పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశారు. అలాగే‌ విశ్వక్షేన్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలపై కృషి చేయాలని కోరారు. గోవిందరెడ్డి మాట్లాడుతూ.. జనసైనికులు అందరూ కలిసి పనిచేయాలని దానికి తన పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశారు. జి.సిగడాం మండల ప్రెసిడెంట్ మీసాల రవి మాట్లాడుతూ సమస్యలు సాధనే లక్ష్యంగా పనిచేయాలని, ప్రతి గడపకు మన జనసేన సిద్ధాంతాలను తెలియ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి సిగడాం మండల అధ్యక్షులు మీసాల రవి, రణస్థలం మండలం అధ్యక్షులు బస్వ గోవిందరెడ్డి, ఎచ్చెర్ల నియోజకవర్గం ఐటీ విభాగం కో-ఆర్డినేటర్ గొర్లె రాంబాబు, రణస్థలం మండల నాయకులు గొర్లె సూర్య మరియు అప్పన్న ల టీంకు సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డాది శ్రీనివాసరావు, బాలరాం, ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు మరియు జనసైనికులు అందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు.