ఘనంగా శ్రీమతి డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతులమీద ప్రారంభోత్సవం చేయబడి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ఏర్పాటుచేస్తున్న శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం నందు ప్రతి శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతులకు అన్నపానీయ సదుపాయమును కల్పించడం జరుగుతుంది. 28వ వారం కూడా శనివారం 750 మంది రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చి ఔట్ పేషెంట్లకు కలిపి అన్న సదుపాయమును కల్పించారు. శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయసదుపాయ కేంద్రం నందు రైతులకు, పశువుల అమ్మకమద్యవర్తులకు, హాస్పటల్ ఔట్ పేషెంట్ లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లంకిషోర్, నక్కా మణికంఠ, పోట్టినురి గణేష్, జ్యోతుల కృష్ణ, బొత్స శ్రీకాంత్, ఎద్దురాజు, మంతెన గణేష్, చల్లా నూకరాజు, ఇప్పర్తి శీను, జ్యోతుల నాని, కోలా నాని, మేడిబోయిన హరికృష్ణ తదితరులు ఆహర పానీయ వడ్డనలో తమ సేవలను అందించారు. శ్రీమతి డోక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రమునకు శ్రమశక్తి ద్వారా సేవలందిస్తున్నారని వారికి నా ప్రత్యేకమైన దన్యవాదాలను తెలియజేయుచున్నానని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు ఒక ప్రకటనలో తెలియజేశారు.