జనసైనికునికి ప్రమాద బీమా అందించిన చిలకం మధుసూదన్ రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గం, ముదిగుబ్బ మండలం, కొడవండ్లపల్లి గ్రామానికి చెందిన రేకే నాగభూషణ ఇటీవల బైక్ యాక్సిడెంట్ లో గాయపడడంతో వారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం వలన ప్రమాదపు బీమా క్రింద 6,500 రూపాయలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా నాగభూషణ కి చెక్కును అందించడం జరిగింది.