ఆగస్టు 29న హోటల్ మేనేజ్‌మెంట్ జేఈఈ

హోటల్ మేనేజ్‌మెంట్ జేఈఈ పరీక్ష తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీహెచ్ఎంసీటీ-జేఈఈ) ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు తెలిపింది. హాల్‌టికెట్లను పరీక్షకు 15 రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. ఈ కంప్యూటర్ బేస్ట్ పరీక్ష ఆగస్టు 29న మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపింది. ఈ ప్రవేశపరీక్షను ఎన్‌టీఏ నిర్వహిస్తున్నది. పూర్తి వివరాలకోసం nta.ac.in, nchmjee.nta.nic.in వెబ్‌సైట్లలో చూడవచ్చని పేర్కొంది.