అమ్మిశెట్టి వాసు ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

  • రాష్ట్రంలోనే అతిపెద్ద స్కాం జగనన్న కాలనీలు…. విజయవాడ నున్న లో జగనన్న కాలనీలో నిర్మాణాలను పరిశీలించిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, ఇతర నేతలు
  • అమ్మిశెట్టి వాసు… జనసేన రాష్ట్ర కార్యదర్శి
  • జగనన్న కాలనీలు.. నేడు పేదవాళ్ళ కన్నీళ్లుగా మారిపోయాయి
  • ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తామంటే జగన్ ను గెలిపించారు
  • సెంటు స్థలం ఇచ్చి ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని జగన్ చెప్పారు
  • ఇప్పుడు సెంట్ స్థలంతో సరిపెట్టి.. నడి సంద్రంలో పేదలను వదిలేశారు
  • సొమ్ములు ప్రజలది.. సోకులు జగన్ వా..
  • జగనన్న కాలనీల్లో అడుగు పెట్టాలంటే పేదలు భయపడుతున్నారు
  • పేదలకు ఇళ్లు ఇవ్వరు కానీ… ప్యాలెస్ మీద ప్యాలెస్ లు నిర్మించుకుంటారు
  • నున్న నుంచి ఏడు కిలోమీటర్లు లోపలకు సెంట్ స్థలం ఇచ్చారు
  • ఇలాంటి ప్రాంతాల్లో ఇళ్లు ఇచ్చి.. పేదలను ఉద్దరించినట్లు జగన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు
  • జనసేన చేపట్టిన సోషల్ ఆడిట్ ద్వారా జగన్ అక్రమాలు వెలుగులోకి వస్తాయి
  • కాలనీల్లోకి వెళ్లితే.. పేదల పడే పాట్లుతో కన్నీరు పెడుతున్నారు
  • చేసిన అప్పులు తీర్చలేక పేదలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది
  • జగన్ రెడ్డి మాటలతో మాయలు చేయడం మాని… ప్రజలకు మేలు చేయాలి

జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు. #JaganannaMosam డిజిటల్ క్యాంపైన్ మరియు సోషల్ ఆడిట్ కార్యక్రమంలో బాగంగా అమ్మిశెట్టి వాసు ఆద్వర్యంలో నున్న సెంటర్ నుండి, వికాస్ కాలేజ్ రోడ్ లో ఉన్న టిడ్కో ఇళ్ల మరియు జగనన్న కాలనీలు సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు సెంట్రల్ నియోజకవర్గల డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ నాయకులు, కృష్ణ-పెన్న కమిటీ సభ్యులు, విజయవాడ అధికార ప్రతినిధులు, నగర కమిటీ సభ్యులు, నున్న గ్రామ మండల అధ్యక్షులు, మరియు నున్న స్థానిక జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ వీర మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.