విపరీతమైన విద్యుత్ చార్జీల పెరుగుదలతో పేద కుటుంబాలు కాలం వెళ్ళదీసేది ఎలా..?: పెండ్యాల శ్రీలత

అనంతపురం, జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ మహిళా కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటమంతి కార్యక్రమంలో భాగంగా గురువారం 40వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 35వ డివిజన్ మంగళవారి కాలనీలో పర్యటించి స్థానిక ప్రజలనుంచి పలు సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ ఏఇంటికి వెళ్లిన ఏమహిళను అడిగిన వైకాపా ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచడం ద్వారా విపరీతంగా బిల్లులు వచ్చి లైట్ కానీ, ఫంకా కానీ వేయాలంటేనే భయంగా ఉందని, ఈ జగన్ రెడ్డి ప్రజలను కరెంట్ ఉన్న పెరిగిన రేట్లతో ఉపయోగించుకునే పరిస్తితి లేక తిరిగి కరెంట్ లేని కాలానికి ప్రజలను తీసుకెళ్లాడని ఒక్క ఛాన్సు అని అధికారం కట్టపెడితే జీవితాలలో వెలుగులు లేకుండా చేసాడన్నారు. దీనితో పాటు ఇక్కడ డివిజన్ లో మురుగుకాలువలు అధ్వాన్నంగా ఉన్నాయని దీనికి తోడు మంచినీటి కొరతకుడా విపరీతంగా ఉందని ప్రజలకు ఏ మాత్రం మేలు చేయమి ఈ వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామని రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోరే జనసేన టీడీపీ పార్టీలకు ఓటు వేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.