జనసైనికులను పరామర్శించిన ఎన్ని రాజు

రాజాం నియోజకవర్గం, వంగర మండలంలో కింజంగి గ్రామానికి చెందిన జనసైనికుడు బెజ్జిపురపు సత్యనారాయణకు తలకు గాయం తగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే ఈ మధ్యనే జనసేన పార్టీలో చేరిన తలగాం గ్రామానికి చెందిన పైల కృష్ణకు గత వారం కుడి చేతికి సర్జరీ జరిగింది. విషయం తెలుసుకున్న నియోజకవర్గ నాయకులు ఎన్ని రాజు జనసైనికులతో కలిసి ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణను మరియు సర్జరీ అయి తలగాంలో విశ్రాంతి తీసుకుంటున్న పైల కృష్ణను మధ్యాహ్నం పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ, ఎప్పటి లాగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని మరియు పార్టీ ఎప్పుడూ మీకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని వాళ్ళకు ధైర్యం చెప్పటం జరిగింది.