ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్కు భారీ స్పందన.. 24 గంటల్లోనే లక్ష
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్కు విశేష స్పందన లభించింది. ఈ సంస్థ త్వరలో విడుదల చేయనున్న స్కూటర్ కోసం 24 గంటల్లోనే లక్ష మందికిపైగా వినియోగదారులు బుకింగ్ చేసుకున్నారు. ఈ స్కూటర్ కోసం రూ.499 అడ్వాన్స్తో జులై 15 నుంచి తన వెబ్సైట్లో ముందస్తు బుకింగ్స్ను స్వీకరిస్తోంది. దీని ధరను ఇప్పటి వరకు వెల్లడించక పోయినప్పటికీ.. వినియోగదారులు అమితాసక్తి కనబర్చడం విశేషం. ఈ నెల చివరి నుంచి అమ్మకాలను ప్రారంభించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కు విశేష స్పందన లభిస్తోంది.