హుస్నాబాద్ జనసేన ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు

హుస్నాబాద్ పట్టణంలో మిషన్ భగీరథ వాటర్ లీకేజీ అవుతున్నా, జాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం లేదని, మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ నీరు వ్రృధాగా పోతూ, రోడ్డుపైకి వచ్చి చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. కావున వెంటనే తగు చర్యలు తీసుకోని మరమ్మతులు చేయాలని జనసేన పార్టీ తరపున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పొడి శెట్టి విజయ్, మొలుగూరి అరవింద్, చెల్పూరి వినోద్, సంతోష్, బత్తుల జగదీష్ , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.