రహదారుల దుస్థితిపై గళమెత్తిన పెనుకొండ జనసేన

సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, పెనుకొండ పట్టణంలో, నారాయణమ్మ కాలనీ, పరిటాల డిగ్రీ కాలేజ్, మంగాపురం, కొనాపురం, వెళ్లే రహదారులను మంగళవారం జనసేన మండల అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు రాజేష్, మండల కన్వీనర్ మహేష్ మాట్లాడుతూ.. సంవత్సరం క్రితం ఇదే రోడ్డును పరిశీలించి మరమ్మతులు చేయాలని అధికారులకు, నాయకులకు విన్నవించినా ఇంత వరకు ఈ రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదు. స్థానిక ఎమ్మెల్యే శంకర్నారాయణ గారికి మరియు మున్సిపల్ చైర్మన్ ఉమర్ ఫారూఖ్ గారికి వార్డ్ కౌన్సిలర్ కి జనసేన పార్టీ తరఫున ఒకటే తెలియజేస్తున్నాం మీ పార్టీ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు అవుతున్నా కూడా ఇదిగో రోడ్డు, అదిగో రోడ్డు అంటూ మంగాపురం కోనాపురం ప్రజలను మభ్యపెడుతూ వారికి కల్లబొల్లి మాటలు చెబుతూ కాలక్షేపం చేయడం మానుకొని వెంటనే రోడ్డు మరుమ్మత్తులు చేయకపోతే ప్రజాసేవే లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీ తరుపున మా సొంత నిధులతో మేమే రోడ్లు మరమ్మత్తు చేయిస్తాం అని జనసేన పార్టీ తరుపున స్థానిక ఎమ్మెల్యేని హెచ్చరిస్తున్నాం అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు రాజేష్, పెనుకొండ మండల కన్వీనర్ మహేష్, మండల ఉపాధ్యక్షులు, సురేష్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, సీనియర్ నాయకులు బంగారం, యువ నాయకులు ప్రదీప్, హరి నాయక్, నాయకులు, మంజునాథ్, శ్రీనాథ్, తిరుపతి, గోపాల్, సాయి, బాబా తదితరులు పాల్గొన్నారు.