చర్చకు నేను సిద్ధం.. తోట త్రిమూర్తులు మీరు సిద్ధమా..??: వేగుళ్ళ లీలాకృష్ణ

మండపేట: తోట త్రిమూర్తులు భూ కబ్జా వ్యవహారంలో ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని, మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ మండపేట జనసేన ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ నేను చాలా చిన్న వాడిని, మీకు లాగా ప్రజల ఆస్తులు వందల ఎకరాలు దొంగలించే శక్తి నాకు లేదని పేర్కొన్నారు. భూములు కొన్నట్లు ధ్రువీకరణ చూపిస్తున్న తోట తాను ఆయనపై చేసిన ఆరోపణలకు జవాబు చెప్పగలరా అంటూ నిలదీశారు. తోట త్రిమూర్తులు ఆయనే కోర్ట్ కేసు ఉపసంహరించుకొని, కలెక్టర్ వద్ద న్యాయ విచారణకు సిద్ధంగా ఉన్నానని మొదట ఆయనే మాట్లాడారని స్పష్టం చేశారు. ఆయనే ప్రభుత్వంలో ఉన్నారని తక్షణమే దీనిపై విచారణ కమిషన్ నీయమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ వద్ద తోట త్రిమూర్తులు ఎప్పడు విచారణ అంటే తాము అప్పుడు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అలాగే న్యాయవాది కూడా తామే తీసుకొని వస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న మీడియాను మీరే తీసుకొనిరావాల్సిన బాధ్యత తోటదే అన్నారు. మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి తోట త్రిమూర్తులు ది తప్పు అని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికీ తాను చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇక తోట రాజకీయ సన్యాసంకు సిద్ధంగా ఉండాలని హితవు పలికారు. వ్యక్తిగత కారణాలు వల్ల మీడియా సమావేశం ఏర్పాటు చేయకపోయామని చెప్పారు. మీడియా వారు అర్థం చేసుకొని ఈ సమాచారాన్ని తోట త్రిమూర్తులుకి అందజేయవాల్సిందిగా ఆయన కోరారు.