యాక్సిడెంట్ అయిన వ్యక్తికి మనోధైర్యాన్నిచ్చిన ఇచ్చాపురం జనసేన 100 సోల్జర్స్

ఇచ్చాపురం నియోజకవర్గ కంచిలి మండలం అంపురం గ్రామానికి చెందిన కూర్మరావు గత కొద్దిరోజుల క్రితం యాక్సిడెంట్ అయ్యి చికిత్స కోసం చూస్తున్న సమయంలో ఇచ్చాపురం జనసేన 100 సోల్జర్స్ సంస్థ తరపున ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ దాసరి రాజు చేతుల మీదుగా రూపాయలు 5000 ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది. అనంతరం కవిటి మండలం మంగళవారం సంతలో సవశాన పుట్టుగ రపాకాపుట్టుగ చలివేంద్రం 5వ వారం మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్చార్జి దాసరి రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో కంచిలి జడ్పీటీసీ అభ్యర్థి డొక్కరి ఈశ్వరరావుశారద ఎంపీటీసీ అభ్యర్థి సుశీల బూరగాం ఎంపీటీసీ అభ్యర్థి గాంధీ, జనసేన ఇచ్చాపురం నియోజకవర్గ నాయకులు సురేష్, భాస్కర్, మన్మధ,సంతోష్, హేమ చలపతి, దివాకర్, భాస్కర్,రామకృష్ణ,ధనుంజయ్, రాజు, కోదండ, రామ, శ్యామ్, హేమసుందర్, ప్రసాద్ మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.