ఇచ్ఛాపురం జనసేన 100 సోల్జర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

ఇచ్ఛాపురం, అన్నపూర్ణగా పిలవబడే డొక్కా సీతమ్మ 113 వ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె ఆ కాలంలో చేసినటువంటి అన్నదాన స్ఫూర్తితో కవిటి మండలం కవిటి మేజర్ పంచాయతీ బస్టాండ్ వద్ద ఇచ్ఛాపురం జనసేన 100 సోల్జర్స్ ఆధ్వర్యంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు సమక్షంలో వీరమహిళ బాసి భారతి రెడ్డి చేతుల మీదుగా డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. సుమారుగా 500 మందికి పైగా వచ్చి భోజనాలు చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, కంచిలి జెడ్పీటీసీ అభ్యర్థి డొక్కరి ఈశ్వరరావు, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్, బెజ్జిపుట్టుగ ఎంపీటీసీ అభ్యర్థి కూర్మారావు, మున్సిపాలిటీ ఇంఛార్జిలు సంతోష్ మహారణ, రొకళ్ల భాస్కర్ రావు మరియు జనసైనికులు దంగు భాస్కర్, రామకృష్ణ, బడే దేవరాజు, మన్మధ, హేమా చలపతి, త్రినాధ్ బెహరా, శివ బెహరా, ధవళ రాజు, దివాకర్, బల్లెడ ప్రవీణ్, దశరథ, నగేశ్, ఎర్ర ప్రకాష్, దుర్యోధన, దేవ, ధనుంజయ, హరీష్, వెంకటేష్, మురళి, డిల్లేశ్ మరియు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.