బాత్రూం నిర్మాణం కోసం తవ్వుతుంటే.. బంగారం

గద్వాల జిల్లాలో ఓ ఇంట్లో బాత్రూం నిర్మాణానికి కూలీలు పునాదుల తవ్వారు. అయితే, ఈ తవ్వకాల్లో ఊహించని రీతిలో బంగారు నాణేలు బయటపడ్డాయి. వారు ఇంటి యజమానికి తెలియకుండా నాణాలను తీసుకున్నారు. దాదాపు 100 నాణేలు దొరకగా.. వాటిని సైలెంట్ గా పంచుకోవలనుకున్నారు. తాజాగా పంపకాల విషయంలో తేడా రావడంతో విషయం బయటపడింది. అది కాస్తా అధికారుల వరకు వెళ్లడంతో.. కూలీలను అదుపులోకి తీసుకొని  నాణాలను స్వాధీనం చేసుకున్నారు.