ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోతే.. జనం కోసం జనసేన ప్రజా ఉద్యమం చేపడుతుంది

బుక్కరాయసముద్రం:జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్ పిలుపు మేరకు రోడ్ల అద్వాన పరిస్థితులను తెలియజేస్తూ .. సింగనమల నియోజక వర్గం జనసేన పార్టీ అధ్వర్యంలో #GoodMorningCMsir కార్యక్రమం గత మూడు రోజులుగా డిజిటల్ క్యాంపెయిన్ భాగంగా బుక్కరాయసముద్రం మండలం, రేకులకుంట నుండి సిద్ధరాంపురం రోడ్డు అధ్వాన పరిస్థితిలో రోడ్లు ఉన్నాయి, ఇదే గుంతల్లో పడి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం మేలుకొని రోడ్లు మరమ్మతులు చేయాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమం చేపడతామని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయడంజరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర, బుక్కరాయసముద్రం మండల అధ్యక్షలు జి. ఏర్రిస్వామి, మండల నాయకులు మునీంద్రా, సుమన్, పెద్దిరాజు, కుళ్ళయప్ప, శ్రీనాథ్, విశ్వనాథ్, అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు.