రైతుల సమస్యలను నెరవేర్చకపోతే, రైతుల పక్షాన పోరాడతామన్న జనసేన నాయకులు

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలోని రైతుల ను కలసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల పక్షాన జనసేన నిలుస్తుందని జనసేన పార్టీ నాయకులు మత్స పుండరీకం, బి.పి.నాయుడు, జనసేన జాని లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని డిమాండ్ లు చేశారు. ప్రభుత్వం తక్షణమే రైతుల దగ్గర నుండి దాన్యం కొనుగోలు చెయ్యాలి. వైసీపీ ప్రభుత్వం దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నది. మిలర్ల తో కుమ్మకైన వైస్సార్సీపీ నాయకులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వైస్సార్సీపీ నాయకుల అండదండలతో 81 కేజీల బదులుగా 84 కేజీలు తీసుకుంటున్న మిలర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. రైతులకు ట్రక్ సీట్లు ఇవ్వటం లో వైసీపీ నాయకులుదే పైచేయిగా ఉంది. అగ్రికల్చర్ అధికారులు నామమాత్రంగా ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న ధాన్యానికి తక్షణమే డబ్బులు చెల్లించాలి. మిగులు ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల పక్షాన నిర్లక్ష్య వైఖరిని చూపిస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని రైతులను కోరారు. వారం రోజుల్లో రైతుల సమస్యలను నెరవేర్చకపోతే, రైతుల పక్షాన జనసేన కార్యక్రమం చేపడతామని అన్నారు. రైతన్నల గొంతు, గోడు మీడియా ద్వారా వినిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్, వావిలపల్లి నాగభూషన్, రైతులు పాల్గొన్నారు.