ముస్లింల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా: బత్తుల బలరామకృష్ణ

  • రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న జనసేన నేత బత్తుల బలరామకృష్ణ

రాజానగరం, శుక్రవారం సీతానగరం మండలం, ఇనుగంటివారి పేట మదీనా మజ్జీద్ (మసీదు)లో నమాజులో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ. అనంతర స్థానిక మసీదు కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన బలరామకృష్ణ మైనారిటీల అభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు హామీ ఇచ్చారు. ముస్లింలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. నియోజవర్గం ఎవరికి ఏ కష్టం వచ్చినా కులమతాలకు అతీతంగా తాను ముందు ఉంటానన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీని బలరామకృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ ప్రెసిడెంట్ షేక్ ఖద్దుజ్, ఇస్లాం మజీద్ మౌజానే, షేక్ బషీర్, షేక్ రఫీ, షేక్ మహమ్మద్, షేక్ మహబూబ్ వలీ, షేక్ అజ్మీర్, షేక్ బాషా, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.