జనసేన నాయకులు మీ మీద దాడి చేసినట్టు వీడియోలు ఉంటే బయటపెట్టండి
కొండేపి, ఆంధ్రరాష్ట్రంలో “జగన్ నాటకం” చాలా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు ఈ వైసీపీ నాయకులు, వివేకానంద రెడ్డి హత్య గానీ, మరియు కోడి కత్తి సంఘటన గాని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా నాటకాలు ప్రదర్శిస్తున్నారు, శనివారం వైజాగ్ లో “జనవాణి” కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన మా జనసేన పార్టీ నాయకులను మరియు కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం చాలా దుర్మార్గపు చర్య, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో పవన్ కళ్యాణ్ “జనవాణి” కార్యక్రమం నిర్వహిస్తూ, సామాన్య మానవుడి సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలకు పరిష్కారం మార్గాలు చూపించే దిశగా వెళ్లడం, ప్రజల యొక్క ఆధార అభిమానాలు రోజు రోజుకి పవన్ కళ్యాణ్ కి పెరగడం, ప్రజలందరూ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలవడం జరుగుతుంది. రోజు రోజుకి ఈ రాష్ట్రంలో వైసీపీ పాలన గ్రాఫ్ పడిపోవడం, ప్రజలలో వైసీపీ నాయకులకు వ్యతిరేకత రావడం ఇవన్నీ గమనించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వైసిపి నాయకులు జనవాణి కార్యక్రమం జరగకుండా అల్లర్లు సృష్టించి, గొడవలు రేకెత్తించి, అక్రమంగా మా జనసేన నాయకులు మీద కేసులు పెట్టి నిర్బంధించడం చాలా దుర్మార్గపు చర్య, వెంటనే మా జనసేన నాయకులను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము, మా జనసేన నాయకులు మీ మీద దాడి చేసినట్టు వీడియోలు ఉంటే బయటకు చూపించండి, ఎటువంటి ఆధారాలు లేకుండా కావాలని అరెస్టు చేశారు, ఈ వైజాగ్ సంఘటన మొత్తానికి కారణం ఈ వైసీపీ నాయకులు మాత్రమే, 2024 లో ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, పొన్నలూరు మండలం, జనసేన పార్టీ అధ్యక్షులు “కనపర్తి మనోజ్ కుమార్” మీడియా ద్వారా తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-16-at-16.03.52-814x1024.jpeg)