డయేరియా బాధితులను పరామర్శించిన శివదత్ బోడపాటి

పాయకరావుపేట: వాటర్ ట్యాంక్ శుభ్రత లేకపోవటం, కాలువలు శుభ్రం చెయ్యని కారణంగా సుమారు 40 మంది చిన్నతీనార్ల గ్రామస్థులు ఒకేసారి డయేరియా బారిన పడ్డారు. అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వారిని పాయకరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి పరామర్శించి, పరిస్థితి అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ చాలా బాధాకరం. ఇది పూర్తిగా స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మరియు పంచాయితీ సిబ్బంది వైఫల్యమేనని .. బాదితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.