విజయం సాధిస్తాం.. జనసేన జెండా ఎగరవేస్తాం

  • క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో జనసేన నేతలు

తిరుపతి: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా క్రియాశీలక సభ్యత్వాలను నమోదు చేయించుకున్న ప్రతి ఒక్కరికి ఆదివారం క్రియాశీలక సభ్యత్వ కిట్లను జిల్లా అధ్యక్షులు డా. హరి ప్రసాద్, ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజా రెడ్డి ల చేతుల మీదుగా కిట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాలు వేరు, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసిన తర్వాత నుంచి వేరు అని, ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పని చేస్తే రాబోయే రోజుల్లో జనసేన జెండాను ఎగరవేయడం ఖాయమని, జనసేన అధినేతను ముఖ్యమంత్రి చేసుకొని తీరుతామని, అధికార పార్టీకి ఒక జనసేన పార్టీనే ప్రత్యర్థి పార్టీ అని, ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరని మరియు పార్టీ బలోపేతం కోసం కృషి చేసి రాయలసీమలోనే మొట్టమొదటి స్థానంలో నిలిపేలా సభ్యత్వాలను నమోదు చేయించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.