నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ గద్దెనెక్కిన వైసీపీ ప్రభుత్వం గాఢ నిద్రలో ఉంది: మనుక్రాంత్

మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల 4వ రోజు సమ్మెకు మద్దతు గా జనసేన పార్టీ అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

*ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకి కనబడకుండా తిరుగుతున్నాడు.

*రాష్ట్రంలో ఎక్కడ చూసినా కష్టాలు,కన్నీళ్లు కనబడుతున్నాయి.

*చెత్త బుట్టలో వెయ్యాలి ఈ చేత గాని పాలన చేస్తున్న ఈ చెత్త ప్రభుత్వాన్ని.

*అర్హత గల మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలి.

*పనిముట్లు కూడా సరఫరా చేయకుండా పని చేయమంటే ఎలా,కార్మికులు తమ సొంత డబ్బుతో పనికి పరికరాలు కొనుక్కోవడందారుణం.

*సంక్షేమ పథకాలేవీ వారికి అందటం లేదు. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు ఏవి మున్సిపల్ కార్మికులకు అందవు.

* దశాబ్దాలుగా పనిచేసి 60 ఏళ్లకే రిటైర్ మెంట్ అయితే ఒక్క బెనిఫిట్ కూడా వారికి వర్తించటం లేదు.

*ఇస్తున్న హెల్త్ అలవెన్సు ఆరు వేల రూపాయలు కూడా ఆపేశారు దానిని పునరుద్ధరించాలి.

*టైం స్కేల్ అనేది లేకుండా వారి చేత పనులు చేయిస్తున్నారు.

*నెలలో 30 రోజులు పని చేస్తే ఇరవై నాలుగు రోజులకే లెక్కగట్టి జీతం ఇవ్వటం అమానుషం.

*వీరి సమస్యలను అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న జనవాణి జనసేన భరోసా దృష్టికి తీసుకెళ్తాం.

*వారి న్యాయమైన కోరికలు పరిష్కరించే వరకు మున్సిపల్ కార్మికులకు అండగా జనసేన పార్టీ తరఫున మేము నిలబడతామని తెలిపారు.

*గత నాలుగు రోజులు గా మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ చేస్తున్న సమ్మె కు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారు పాల్గొని మద్దతు తెలియజేశారు…

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు సిఐటియు నాయకులతో పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ , జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, అధికార ప్రతినిధి కలువాయి సుదీర్, భీమ, ఖలీల్, హేమచంద్ర, రాజా తదితర జనసైనికులు పాల్గొన్నారు.