జనసేన నాయకులు ఆకెపోగు రాంబాబు అక్రమ అరెస్ట్

కర్నూల్ : ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ పార్టీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంఘిభావ మద్దతు ప్రకటించింది. ఈ నేపధ్యంలో కర్నూల్ తాలూకా ఎస్ ఐ షామీర్ బాషా మరియు ముగ్గురు కానిస్టేబుల్ కోడుమూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఆకెపోగు రాంబాబు ఇంటి దగ్గరికు వచ్చి అక్రమ హౌస్ అరెస్ట్ చేసారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్ లో మేం పాల్గొంటున్నామని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసారని తెలిపారు.