జనసేన నాయకుల అక్రమ అరెస్టులు – జనసైనికుల నిరసన

అమలాపురం, విశాఖలో జనసేన నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా అమలాపురం నల్లవంతెన వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జిలతో జన సైనికులు నిరసన వ్యక్తం చేస్తూ, నినాదాలు చేశారు. జనసేన పార్టీ ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించే “జనవాణి” కార్యక్రమం కోసం విశాఖ విచ్చేసిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను అడుగడుగునా పోలీసు ఆంక్షలతో అడ్డుకోవడమే కాకుండా పార్టీ యొక్క ముఖ్య నాయకులను సైతం అక్రమ అరెస్టులు చేయడం దారుణం అని, వారిని వెంటనే విడుదల చేయకపోతే నిరసనలు మరింత ఉద్రిక్తం చేస్తామని దళిత నాయకులు ఇసుకపట్ల రఘుబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ సతీష్, మున్సిపల్ ప్రతిపక్షనేత యేడిద శ్రీను, లింగోలు పండు, పడాల నానాజీ, రాష్ట్ర నాయకులు నాగమానస, బట్టు పండు, ఆర్.డి.యస్.ప్రసాద్, పప్పుల నానాజీ, వాకపల్లి వేంకటేశ్వరరావు, పోలిశెట్టి చిన్ని, రావూరి భాస్కర రావు, డి.యస్.కుమార్, బండారు వేంకటేశ్వరరావు, తిక్కా సరస్వతి, చేట్ల మంగతారు, కర్రి లక్ష్మిదుర్గ తదితరులు పాల్గొన్నారు.