బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు స్వాతంత్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. ఈ కార్యక్రమంలో ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషిచేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమర యోధులు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ప్రఖ్యాతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, శిరిగిరి శ్రీనివాసులు, బెల్లంకొండ రామక్రిష్ణ, గుండెబొమ్ము శ్రీనివాసులు, యాదగిరి శివ, శిరిగిరి చలపతి, పిచ్చయ్య, పూజాలక్ష్మి, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ కోఆర్డినేటర్ వీరిశెట్టి శ్రీనివాసులు, పోటు వెంకటేశ్వర్లు, శివ సింగ్, ఆదినారాయణ, ఓర్సు శంకర్, ప్రసన్నకుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.