మాగుంట రాఘవరెడ్డితో సమావేశమైన ఇమ్మడి కాశీనాథ్

ప్రకాశం జిల్లా, జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ తో సమావేశం జరిగినది. ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాథ్ రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున మార్కాపురం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని రాఘవరెడ్డికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం, జనసేన వీరమహిళల ఇంచార్జులు షేక్ తార, మమత, కల్పన, కళ్యాణ దుర్గం ముఖ్యనాయకులు రాజు, అనిల్ పాళ్యం, దొడగట్ట ముఖ్యనాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.