రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిన జగన్

  • బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం: తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని అధికారం చేపట్టిన జగన్ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మార్చారని జనసేన నియోజకవర్గం ఇంచార్జ్, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లిలో పల్లెపోరు కార్యక్రమాన్ని శనివారం మూడో రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ పల్లెపోరు కరపత్రాలను పంపిణీ చేశారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి మాట్లాడుతూ పోత్తు ధర్మం పాటించి ప్రతి ఒక్కరు కూడా నిస్వార్ధంగా కూటమి గెలుపునకు పనిచేయాలని రాష్ట్ర అభివృద్ధి చేయంగా కూటమి పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు కదిలారు. శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవస్థలను నిర్వీర్యం చేసి జగన్ సర్కార్ రాష్ట్రాన్ని ఇటు ఆర్థికంగాను, అభివృద్ధి పరంగాను అంధకారంలోకి నెట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.