ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఇమ్మడి కాశీనాధ్ ప్రచారం

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం 22వ వార్డు నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం, జనసేన మరియు బిజెపి పార్టీల మార్కాపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కందుల నారాయణరెడ్డిని మరియు ఒంగోలు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్ మరియు ఉమ్మడి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంతలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మార్కాపురం పట్టణ 22వ వార్డ్ ఇంచార్జ్ పూజా లక్ష్మీ, జనసేన, తెలుగుదేశం, మరియు బిజెపి నాయకులు, 22వ వార్డు కూటమి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.