మార్కాపురం 21 వ బ్లాక్ నందు పర్యటించిన ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం 21 వ బ్లాక్ నందు ప్రజా సమస్యలపై వారి యొక్క స్థానిక పరిస్థితుల దృష్ట్యా వార్డు నందు పర్యటించి కార్యకర్తలకు విధి, విధానాలు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాధిక్, మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్, పట్టణ 21వ బ్లాక్ ఇంఛార్జ్ పిన్నెబోయిన లక్ష్మీ రాజ్యం, జనసేన నాయకులు పిన్నెబోయిన శ్రీనివాసులు, పిచ్చయ్య, పోటు వెంకటేశ్వర్లు, మట్టం శ్రీను, తిరుపతయ్య, జానకి రామ్, ఖాజావలి, మధు, కళ్యాణ్, శ్రీను మరియు జనసేన కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.