జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టే వైసీపీ ఫ్లెక్సీలను తొలగించండి: గంధం శెట్టి

రైల్వేకోడూరు: వైసిపి ప్రభుత్వం మరియు వైసీపీ కార్యకర్తలు దుష్ట ఆలోచనలతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ఉద్దేశంతో పనికిమాలిన ప్లెక్సీలను జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఏర్పాటు చేస్తున్నారు… దీనిపై రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు స్పందిస్తూ ఇటువంటి ఫ్లెక్సీలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేయడం దురదృష్టకరమన్నారు.. రైల్వే కోడూర్ పంచాయతీ వారు పోలీస్ వారి సహకారంతో ఇలాంటి ఫ్లెక్సీలను వెంటనే తీసివేయాలని కోరారు.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సిబిఐ కబంధహస్తాల నుండి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రజలను ఏ మార్చే ఉద్దేశంతో ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన చేయడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.. వైసిపి ప్రభుత్వానికి గతంలో తాము చేసిన తప్పిదాలు మెడకు ఉరితాడులా తగులుకున్నాయని ప్రజలకు తెలుసన్నారు.. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తగిన విధంగా ప్రజలు ఇలాంటి దుష్ట నాయకులకు సరైన సమాధానం చెబుతారని, అందుకోసం ప్రతి ఓటరు ఎదురుచూస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు.. ఇలాంటి ఫ్లెక్సీలను వెంటనే తొలగించకపోయినచో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు చేపడతామని తాము కూడా వివిధ రకాల పోస్టర్లని ఊరంతా ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.